Ram Mohan Naidu: వైకాపా అక్రమాలను పార్లమెంట్లో ఎత్తిచూపుతాం: ఎంపీ రామ్మోహన్నాయుడు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైకాపా అవినీతిని ఎండగడతామన్నారు.
దిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు విమర్శించారు. వైకాపా కోరినట్లుగా అత్యధిక ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ.. వారంతా రాష్ట్ర హక్కులను కేంద్రంలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎంపీ కనకమేడలతో కలిసి ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మేలును కోరే ప్రతిపక్ష పార్టీగా ఈ అంశాలన్నింటినీ డిసెంబరు 7 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైకాపా ఎంపీలు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా తీరుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అవినీతి గురించి ప్రశ్నించినా, వైకాపా నేతలను నిలదీసినా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని రామ్మోహన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, అందుకే తమ వాదనను పార్లమెంట్ సాక్షిగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో ముడిపడిన చాలా అంశాలను చర్చకు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తామన్నారు. ప్రజల హక్కులను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతలు దిల్లీలో సొంత అజెండా చూసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని.. దాన్ని కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్