TRS Foundation Day: ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఈ నెల 27న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 21వ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Published : 17 Apr 2022 15:17 IST

హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ఈనెల 27న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మిగతా శ్రేణులు ఆరోజు గ్రామాలు, పట్టణాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలని కోరారు. తెరాస ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెరాస ఏర్పడి 21 ఏళ్లు అయింది. హెచ్‌ఐసీసీలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజాప్రతినిధుల మహాసభకు 3వేల మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం. వారందరికీ పాసులు జారీ చేస్తాం. మిగతా వారంతా గ్రామాలు, పట్టణాల్లో సంబురాలు జరుపుకోవాలి. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి. తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించింది. ఈ వేడుకలను శ్రేణులంతా పెద్దఎత్తున జరుపుకోవాలి’’ అని కేటీఆర్‌ తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ పరిధిలోని నాయకులతో సమావేశం కానున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని