మద్యం అక్రమాలపై సమగ్ర విచారణ.. అధికారంలోకి రాగానే విషపూరిత బ్రాండ్ల రద్దు
అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్లను రద్దుచేస్తామని, మద్యం అక్రమాలపైౖ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
రూ.10 ఇచ్చి రూ.100 లాక్కునే విధానానికి స్వస్తి: చంద్రబాబు
ఉమ్మడి మ్యానిఫెస్టోకు కేంద్రం సంపూర్ణ మద్దతు: భాజపా
ఈనాడు, అమరావతి: అధికారంలోకి రాగానే విషపూరిత మద్యం బ్రాండ్లను రద్దుచేస్తామని, మద్యం అక్రమాలపైౖ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని, వైకాపా ప్రభుత్వం అమలు చేసిన రూ.10 ఇచ్చి ప్రజల నుంచి రూ.100 లాక్కునే విధానానికి స్వస్తి పలుకుతామని పేర్కొన్నారు. ‘మ్యానిఫెస్టో రూపకల్పనలో తెదేపా, జనసేనల భాగస్వామ్యం ఉంది. భాజపా సూచనలూ తీసుకున్నాం. ఎన్డీయే జాతీయస్థాయిలో మ్యానిఫెస్టో ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో ఎక్కడా వారు భాగస్వాములు కావడం లేదు. కూటమి మ్యానిఫెస్టోకు కేంద్ర సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే భాజపా నేతలు ఇక్కడికి వచ్చారు. మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసే బాధ్యతను జనసేన, తెదేపా తీసుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం ఆయన ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రూ.13 లక్షల కోట్ల అప్పులు
‘జగన్కు పాలన చేతకాదు. కానీ డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. ఆయన వాహనాన్ని రివర్స్లో తోలుతున్నారు. బుద్ధి ఉన్నవారు ఎవరైనా రివర్స్ టెండరింగ్ చేస్తారా? వైకాపా హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అభివృద్ధి జరిగిందా? ఇక ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే అప్పులు చేశారు. ఇప్పుడు ఏమీ చేయలేనని చేతులెత్తేశారు. రూ.2.70 లక్షల కోట్లకు బటన్ నొక్కానంటున్నారు. అమరావతిని కొనసాగించి ఉంటే రూ.3లక్షల కోట్లు వచ్చేవి. దానికి బదులు రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని మండిపడ్డారు.
భూముల్ని దోచుకునేందుకే.. ఆ యాక్ట్
‘వైకాపా ప్రభుత్వం తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు... అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. దీన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజల భూములు దోచుకోవాలని చూస్తున్నారు. 40-50 ఏళ్లు కష్టపడి సంపాదించుకొన్న ఆస్తులనూ మెడమీద కత్తిపెట్టి రాయించుకున్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దుచేస్తా’ అని హామీ ఇచ్చారు.
‘ఊరూరా మంచినీళ్లు దొరకవు కానీ గంజాయి దొరికే పరిస్థితి తెచ్చారు. వందరోజుల్లో గంజాయి, మాదకద్రవ్యాల్ని నియంత్రిస్తాం. ఉచిత ఇసుక విధానం తెస్తాం. విదేశీ విద్యను ప్రారంభించి అందరికీ వర్తింపజేస్తాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. గ్రామాల నుంచి మండలాలకు, అక్కడి నుంచి జిల్లాలకు, అటు నుంచి పోర్టులు, మార్కెట్లకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి అధిక ప్రాధాన్యం ఇస్తాం. రాయితీలు ఇస్తాం. పర్యాటకానికి చాలా అవకాశాలున్నాయి. విద్యుత్తు ఛార్జీలు నియంత్రిస్తాం. అవినీతి అరికడతాం. చెత్తపన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నులనూ సమీక్షిస్తాం. పెట్రోలు, డీజీల్ ధరలు, మద్యం ధరల్ని నియంత్రిస్తాం’ అని పేర్కొన్నారు.
రిజర్వాయర్లే కొట్టుకుపోతున్నాయి
‘సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేశారు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వానంగా ఉంది. కాలువలు, డ్రెయిన్లు తవ్వలేదు. రిజర్వాయర్లు కొట్టుకుపోతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు మూడుసార్లు కొట్టుకుపోయాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం. నదులు అనుసంధానిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు. ‘దేవాదాయ ఆస్తుల కబ్జాల్ని అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు.
యువతలో నైపుణ్య గణన
‘యువతలో నైపుణ్య గణన చేస్తాం. ఇది దేశంలోనే తొలిసారి. ప్రపంచ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు అందిస్తాం. చిన్న, మధ్యతరహా, అంకుర పరిశ్రమలకు రూ.10లక్షల వరకు సబ్సిడీ ఇస్తాం. డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువస్తాం’ అని అన్నారు.
‘ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తాం. ఇందులో దామాషా ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం. అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. బీసీల హత్య కేసులన్నీ తిరగతోడుతాం. నిందితులకు శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు.
తొలిసారిగా రూ.25లక్షల ఆరోగ్య బీమా
‘దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యబీమాను తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికీ రూ.25లక్షల బీమా ఇప్పిస్తాం. డిజిటల్హెల్త్కార్డులు ఇస్తాం. చంద్రన్న బీమా పథకంతో సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తాం’ అని ప్రకటించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండ
‘వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా నష్టపోయారు. ఉపాధ్యాయులను నిస్సహాయ స్థితికి తెచ్చారు. వారి హక్కులపై మాట్లాడినందుకు కేసులు పెట్టి సంఘాల నాయకులను అరెస్టు చేయించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం. అది వచ్చేలోపు మధ్యంతర భృతి ఇస్తాం. బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తాం. సీపీఎస్ను కూడా సమీక్షించి సరైన మార్గం చూపించేలా కృషి చేస్తాం. అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, పోలీసుశాఖలో ఉండే వారికి మేలు చేస్తాం. వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంచుతాం’ అని స్పష్టం చేశారు.
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
‘ఉచితంగా సోలార్ పంప్సెట్స్ ఏర్పాటుచేసి, వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును వారికిచ్చి.. మిగిలింది గ్రిడ్కు ఇచ్చి డబ్బులు పొందేలా చూస్తాం. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం పరికరాలు, యంత్రాలు రాయితీ మీద ఇస్తాం. కౌలురైతులకు గుర్తింపుకార్డులు ఇస్తాం’ అని తెలిపారు.
ఉద్యోగ కల్పన కేంద్రంగా అమరావతి
‘రాజధాని అమరావతితోనే సంపద సృష్టి సాధ్యం. అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రజల రాజధానిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ కల్పన చేసేలా, రాష్ట్రానికి ఆదాయ కేంద్రంగా అమరావతిని మారుస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు చెప్పారు.
ఇళ్ల స్థలాలను రద్దుచేయం
‘పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటికే పట్టాలిచ్చినవారికి అవే స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాం. ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాన్ని రద్దుచేయం. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్ధిదారులకు అప్పగిస్తాం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చాం. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళల్లో మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం