Hyderabad: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ

భారాస అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

Updated : 05 Mar 2024 15:09 IST

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులు, పలు ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారాస విధానాలను ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని