BSP: అసైన్డ్ భూములు లాక్కొని ప్రభుత్వమే వ్యాపారం చేయడం దుర్మార్గం: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
రాష్ట్రంలో 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆక్షేపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆక్షేపించారు. హెచ్ఎండీఏ పరిధిలో అసైన్డ్ భూముల ఆక్రమణలపై హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల ప్రచార లోగోను ఆవిష్కరించారు. ధరణి పోర్టల్ - ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు.
‘‘బహుజనవాదిననే ముసుగులో సీఎం కేసీఆర్ దళితులను పదేళ్ల నుంచి మోసం చేస్తున్నారు. పేదల అసైన్డ్ భూముల్లో శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు కడుతున్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల దగ్గర ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి రైతులకు పంచుతాం. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తాం. నగరంలో ఇళ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తున్న తరహాలోనే అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలి. స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసే జీవో నెం 46ను తక్షణమే సవరించాలి’’ అని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!