Jagga Reddy: సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది: జగ్గారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని భారాస ప్రయత్నిస్తోందన్నారు. లేనివి ఉన్నట్లు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు భారాస మాటలు నమ్మొద్దన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
‘‘రుణ మాఫీ విషయంలో సీఎం కేసీఆర్ మాటతప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి విషయంలో మాకు స్పష్టత ఉంది. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం. మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాదు.. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. జీవోల విషయంలోనూ కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పనులు అవుతాయి. భారాస పథకాల గురించి చెబితే ప్రజలు నమ్మరని తెలిసే తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణలో కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తుంది. అధికారంలోకి వస్తుంది’’ అని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి