AP: కౌంటింగ్‌పై ఎస్‌ఈసీ మార్గదర్శకాలు

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్

Published : 14 Mar 2021 01:10 IST

అమరావతి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలనూ ప్రకటించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని.. ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్, వీడియో లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపరచాల్సిందిగా ఆదేశించారు.

నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చారు. పది కంటే తక్కువ మెజారిటీ సాధించిన సమయంలో మాత్రమే నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్‌కు అనుమతించాలని వెల్లడించారు. రెండంకెల మెజారిటీ వచ్చిన చోట్ల అభ్యర్థి విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా వివరాలు అందించేందుకు మీడియా కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని