ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌

Updated : 30 Jan 2021 19:11 IST

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను కోరారు. ఈ మేరకు సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రులు కోడ్‌ను ఉల్లంఘించకూడదని సూచించారు. అంతేకాకుండా వారి పర్యటనల్లో అధికారులు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేటప్పుడు ప్రభుత్వ వాహనాలను వాడవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే  ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని ఎస్ఈసీ పేర్కొన్నారు. అధికార పర్యటనలతో ముడిపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులకు ప్రచారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మీడియా సమావేశాల కోసం ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా వినియోగించకూడదని లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

అభ్యర్థుల ధ్రువపత్రాలపై ఎస్‌ఈసీ స్పష్టత

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్‌ఈసీ
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని