ఈడీ విచారణకు రౌత్ భార్య మళ్లీ డుమ్మా!
విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను కోరారు. ‘పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ)’ బ్యాంక్ నగరు అక్రమ చలామణికి..........
ముంబయి: విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ‘పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ)’ బ్యాంక్ నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదివారం ఆమెను ఆదేశించింది. ఇంతకు ముందు కూడా ఆమెకు రెండుసార్లు సమన్లు జారీ చేయగా.. అనారోగ్య కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యారు. ఈసారి కూడా విచారణకు డుమ్మా కొట్టిన ఆమె.. సమయం కావాలని కోరారు.
ఈడీ సమన్లనుద్దేశించి కేంద్రంపై సంజయ్ రౌత్ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాజకీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకొని మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర సంస్థల ఒత్తిడితో 22 మంది కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారన్నారు. ఆ జాబితా భాజపా నాయకుల వద్ద ఉందన్నారు. తమను నేరుగా ఎదుర్కోలేకే భాజపా ఈ రాజకీయ క్రీడకు తెరలేపిందని ఆరోపించారు.
ఇవీ చదవండి...
తిరువనంతపురం మేయర్ పీఠంపై ఆర్య రాజేంద్రన్
రైతుల కోసం దీక్షకు దిగుతా : అన్నా హజారే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.