NCP: శరద్ పవార్కు మరో షాక్.. అజిత్ బాటలోనే నాగాలాండ్ ఎమ్మెల్యేలు
నాగాలాండ్లో ఎన్సీపీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
దిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad pawar)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ నుంచి ఎన్సీపీ(NCP) తరఫున గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పూర్తి మద్దతును అజిత్ పవార్(Ajit Pawar)కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే మహారాష్ట్ర ఎన్సీపీలో తిరుగుబాటును చవిచూసిన శరద్ పవార్కు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది.
ఈ నెల ప్రారంభంలో శరద్పవార్ సోదరుడి కుమారుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ పార్టీని నిలువునా చీల్చిన సంగతి తెలిసిందే. 8మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శిందే నేతృత్వంలోని శివసేన-భాజపా కూటమిలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నుంచి వచ్చిన 8మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, అజిత్ పవార్కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాగాలాండ్ ఎమ్మెల్యేలు కూడా అజిత్కే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. నిజమైన ఎన్సీపీ ఎవరిది? అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఈ ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది.
మరోవైపు, పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్, ఆ వర్గంలోని కీలక నేతలు ఇటీవల శరద్ పవార్ను కలిశారు. దీంతో మళ్లీ వీరిద్దరూ కలుస్తారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా అజిత్ వర్గంలోని నేతలు కూడా పార్టీని చీల్చవద్దని శరద్ పవార్ను కోరారు. రెండు రోజులపాటు మౌనం వహించిన శరద్ పవార్.. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆ రెండు వర్గాలు మళ్లీ కలిసే పరిస్థితులు లేవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM