Punjab politics: ‘రాజకీయాల్లో సిద్ధూ ఓ రాఖీ సావంత్’.. ఆప్ నేత వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్!
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలపై స్పందిస్తూ ఆప్ నేత రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
చండీగఢ్ (పంజాబ్): పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శలపై స్పందిస్తూ ఆప్ నేత రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వ్యవసాయ చట్టాల విషయంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీపై సిద్ధూ విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల విషయంలో రెండు పార్టీలూ మొసలి కన్నీరు కారుస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. దీంతో ప్రతి విమర్శలకు దిగిన రాఘవ్ చద్దా.. ‘పంజాబ్ రాజకీయాల్లో సిద్ధూ ఓ రాఖీ సావంత్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వ్యవసాయ చట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయిన నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ నేతలు సుఖ్బీర్ సింగ్బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ దిల్లీలో శుక్రవారం నిరసన తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్పై సిద్ధూ విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పనలో పాలుపంచుకుని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆరోపించారు. ‘మీ డ్రామాలు బహిర్గతం అయ్యాయి’ అంటూ ట్వీట్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీపైనా సిద్ధూ విరుచుకుపడ్డారు. ఓ వైపు దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది ఒక చట్టాన్ని నోటిఫై చేసిందని విమర్శిస్తూ ట్విటర్లో ఓ వీడియో సందేశాన్ని ఉంచారు. అదే ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చింపి వేసిందన్నారు. ఇంతకీ ఆ చట్టాన్ని డీ-నోటిఫై చేశారా లేదా అంటూ ప్రశ్నించారు.
సిద్ధూ వ్యాఖ్యలపై ఆప్ నేత రాఘవ్ చద్దా ఘాటుగా స్పందించారు. ‘‘పంజాబ్ పాలిటిక్స్లో సిద్ధూ రాఖీ సావంత్లాంటోడు. మొన్నటి వరకు కెప్టెన్ అమరీందర్ను తిట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ మందలించేసరికి ఇప్పుడు కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకున్నారు. మళ్లీ రేప్పొద్దున్న కెప్టెన్పై తిట్లదండకం అందుకుంటారు’’ అంటూ చద్దా ట్వీట్ చేశారు. అయితే, రాజకీయ విమర్శల్లో సినీ నటి పేరు తీసుకురావడంతో చద్దాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మీ రాజకీయాల్లోకి ఆమెను లాగడమెందుకు’ అని ప్రశ్నిస్తున్నారు. రాఖీసావంత్కు క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు