Andhra News: తెదేపా ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత.. నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర

Updated : 05 Apr 2022 14:03 IST

కలికిరి: చిత్తూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డిపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారంటూ కల్లూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపేందుకు బయల్దేరిన తెదేపా నేతలను పోలీసుల అడ్డుకున్నారు.

కలికిరి మండలం నగరిపల్లెలో తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కిశోర్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కల్లూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు