TDP: చంద్రబాబుకు అవినీతి మరక అంటే అవకాశమే లేదు: పయ్యావుల కేశవ్
ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని సీఎం జగన్తో పాటు అందరికీ తెలుసని తెదేపా ఎమ్మెల్యే, సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.
మంగళగిరి: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని సీఎం జగన్తో పాటు అందరికీ తెలుసని తెదేపా ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు - జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు’ పేరిట పుస్తకాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేశవ్ తదితరులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయం ఆయనకు పట్టుకుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.
Peddireddy: ‘అంబటిలా మాట్లాడను’: మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
‘‘కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు అవినీతి మరక అంటే అవకాశమే లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని అందరికీ తెలుసు. దాదాపు 30 రోజులైంది.. పైసా కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు. కేవలం రాజకీయ కక్ష, దురాలోచనతోనే కుట్ర పన్నారు. రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.330కోట్లకు తగ్గించాము. రూ.328కోట్లకే టెండరు వస్తే అవినీతి జరిగిందంటారా? ప్రజల నుంచి చంద్రబాబుకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోయారు’’ అని పయ్యావుల కేశవ్ అన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలువేయడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ‘‘నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ఛానెళ్ల సౌకర్యం కల్పించాం. ఏపీ ఫైబర్నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రూ.కోట్ల ఖర్చు కళ్లముందే కనిపిస్తుంటే ఆరోపణలు చేస్తారా? జగన్ ముఠా చేసేది రాజకీయ కుట్ర కాక మరేమిటి?’’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)