TDP: జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు: తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు
రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వెంట ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు (Rammohan Naidu ) అన్నారు.
శ్రీకాకుళం: రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వెంట ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు (Rammohan Naidu ) అన్నారు. చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. తప్పుడు కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఎంపీతో పాటు తెదేపా నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా వాటిపై పోరాటం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో తెదేపా గెలవబోతోంది.. చంద్రబాబు కచ్చితంగా సీఎం కాబోతున్నారు. ప్రజల నుంచి వస్తోన్న స్పందన.. జైలు నుంచి వచ్చిన సమయంలో ఆయనకు లభించిన ఆదరణే దీనికి నిదర్శనం. అర్ధరాత్రి దాటినా ప్రజలు రోడ్లపైనే నిద్రించి చంద్రబాబు కోసం వేచిచూశారు. గంటలపాటు నిరీక్షించి కన్నీటితో స్వాగతం పలికారు. ఏనాడైనా ఇలాంటి చూశామా? మీతో మేమున్నామంటూ ప్రజలు ధైర్యంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లోనూ అలాంటి స్పందనే వచ్చింది. చంద్రబాబుపై వరుసగా కేసులు పెడుతూ జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు’’ అని రామ్మోహన్నాయుడు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ