TDP: జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారు: తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వెంట ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu ) అన్నారు.

Updated : 02 Nov 2023 15:10 IST

శ్రీకాకుళం: రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వెంట ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu ) అన్నారు. చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. తప్పుడు కేసులు పెడుతోందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఎంపీతో పాటు తెదేపా నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. 

‘‘చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా వాటిపై పోరాటం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో తెదేపా గెలవబోతోంది.. చంద్రబాబు కచ్చితంగా సీఎం కాబోతున్నారు. ప్రజల నుంచి వస్తోన్న స్పందన.. జైలు నుంచి వచ్చిన సమయంలో ఆయనకు లభించిన ఆదరణే దీనికి నిదర్శనం. అర్ధరాత్రి దాటినా ప్రజలు రోడ్లపైనే నిద్రించి చంద్రబాబు కోసం వేచిచూశారు. గంటలపాటు నిరీక్షించి కన్నీటితో స్వాగతం పలికారు. ఏనాడైనా ఇలాంటి చూశామా? మీతో మేమున్నామంటూ ప్రజలు ధైర్యంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్‌లోనూ అలాంటి స్పందనే వచ్చింది. చంద్రబాబుపై వరుసగా కేసులు పెడుతూ జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారు’’ అని రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు