Bhatti vikramarka: చరిత్ర చెప్పుకుంటూ మోదీ, కేసీఆర్ బతికేస్తున్నారు: భట్టి
దేశానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు...
హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ ఉద్యమనేతలు, మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, స్వేచ్ఛను హరిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, పేదరికంలో ఉన్న దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను కాంగ్రెస్ తీసుకొచ్చిందని భట్టి తెలిపారు. గడిచిన ఏడేళ్ళుగా తెరాస ప్రభుత్వం ఈ ఉప ప్రణాళికను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని.. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని అస్త్రంగా వాడుకొని వదిలేస్తారేమోననే సందేహాన్ని భట్టి వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ చరిత్ర చెప్పుకొని ప్రధాని మోదీ.. పీవీ నర్సింహారావు చరిత్ర చెప్పుకొని సీఎం కేసీఆర్ బతికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధును ఒక్క హుజూరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..