AP News: పోలీసుల సమక్షంలోనే వైకాపా వర్గీయుల పిడిగుద్దులు..
అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు నేతల ముందే
సుండుపల్లి: అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు నేతల ముందే బాహాబాహీకి దిగడం కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య ఇవాళ తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీడీవో కార్యాలయం బిల్డింగ్ ఆవరణలో ఆసరా కార్యక్రమం ముగించుకొని మండల సర్వసభ్య సమావేశానికి బిల్డింగ్లోకి వెళ్లే క్రమంలో మండల వైకాపా ఇన్ఛార్జి పదవి విషయమై ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్నాథ్రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు పిడిగుద్దులతో పాటు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే మేడా చిక్కుకున్నారు. ఘటనలో ఇద్దరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. నేతలు సర్దిచెబుతున్నప్పటికీ కార్యకర్తలు వినకపోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..