TS News: భాజపా తెలంగాణ నేతలను అభినందించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో సాధించిన స్ఫూర్తితో రాష్ట్రంలో మరింత ముందుకు సాగుతామని తెలంగాణ భాజపా నేతలు వెల్లడించారు. దిల్లీలో...

Updated : 09 Aug 2022 12:24 IST

దిల్లీ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో సాధించిన స్ఫూర్తితో రాష్ట్రంలో మరింత ముందుకు సాగుతామని తెలంగాణ భాజపా నేతలు వెల్లడించారు. దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడుడు నడ్డా.. దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర భాజపా నేతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన నడ్డా.. తెలంగాణలో పరిస్థితి భాజపాకు అనుకూలంగా మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలంగాణలో అనేక కార్యక్రమాలు తీసుకుని పార్టీ ముందుకెళ్తుంది. దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పెద్ద ఎత్తున భారతీయ జనతాపార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది’’ అని డీకే అరుణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని