Huzurabad By Election: మేం కళ్లు తెరిస్తే మాడి మసైపోతారు: ఈటల రాజేందర్‌

తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది

Updated : 30 Sep 2022 15:29 IST

హుజూరాబాద్‌‌: తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది భాజపాయే అని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు. 

ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నందున తామేమీ మాట్లాడటం లేదని.. ఈనెల 30 తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో దానిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. హుజూరాబాద్‌కు దళితబంధు, పెన్షన్లు సహా ఇతర పథకాలు రావడానికి తానే కారణమని చెప్పారు. నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేయలేదని.. తెచ్చిన పార్టీని గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తోంది కేసీఆర్‌ అయినా తెచ్చింది మాత్రం తానేనని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని