Ts News: జగదీశ్ రెడ్డి.. సూర్యాపేటలో ఎలా గెలుస్తావో చూస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గాల అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వాళ్లను చేర్చుకోవడమే వారి పనిగా ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ..

Updated : 30 Sep 2022 14:43 IST

చండూరు: రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గాల అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వాళ్లను చేర్చుకోవడమే వారి పనిగా ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో రాజగోపాల్‌ రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడు అభివృద్ధిని మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని.. సూర్యాపేటలో ఆయన ఓటమికి కృషి చేస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులోనూ దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధును అమలు చేస్తానంటే తానూ రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని