Pawan kalyan : పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.

Updated : 02 Oct 2021 15:36 IST

రాజమహేంద్రవరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా రాజమహేంద్రవరంలోని హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం విమనాశ్రయం చేరుకున్న పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ర్యాలీగా బయలుదేరారు. నగరంలోని క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన పర్యటనకు ఆటంకాలు సృష్టించొద్దని హెచ్చరించారు.

మరోవైపు విమానాశ్రయం నుంచి ర్యాలీగా వస్తోన్న పవన్‌కు.. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. హుకుంపేట-బాలాజీపేట రోడ్డుపై శ్రమదానం అనంతరం పవన్‌ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని