AP News: గవర్నర్కు.. అప్పులకు సంబంధమేంటో బుగ్గన చెప్పాలి: గోరంట్ల
ఆంధ్రప్రదేశ్ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేరుతో అప్పులు తెచ్చి ఆయననూ ఊబిలోకి నెట్టారన్నారు. గవర్నర్కు.. అప్పులకు ఏం సంబంధమో ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్.. అధికారులను పిలిచి మందలించే పరిస్థితి వచ్చిందన్నారు.
ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఏదో ధర్మం చేస్తున్నట్లుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.కోట్లలో అప్పులు తెస్తూ సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని గోరంట్ల ప్రభుత్వాన్ని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.