బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే: అభిషేక్
పశ్చిమ్బంగలో నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనళ్లుడు అభిషేక్ బెనర్జీని విమర్శిస్తూ...
కోల్కతా: పశ్చిమ్బంగలో నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని విమర్శిస్తూ భాజపా నేత సువేందు అధికారి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నిర్వహించిన ర్యాలీలో సువేందు మాట్లాడుతూ ‘‘ దోపిడీల మేనల్లుడు’’ అంటూ పరోక్షంగా అభిషేక్ను విమర్శించారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు గానూ 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని అభిషేక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు.
సువేందు అధికారి పలు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అభిషేక్ మండిపడ్డారు. నోటీసులపై సువేందు స్పందించపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని అభిషేక్ తరఫు న్యాయవాది వెల్లడించారు.
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంత్రివర్గంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. అయితే రాజకీయ కారణాల వల్ల ఇటీవలే పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలదళం, పశ్చిమ్ బంగలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీల మార్పిడి వ్యవహారం కీలకంగా మారింది.అంతవరకూ పార్టీకి విశ్వాసంగా వ్యవహరించిన వారే.. ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగురవేయడం దీదీని ఆలోచనలో పడేస్తోంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!