TRS Party: తెరాస శాసనసభాపక్షం భేటీ.. సాయంత్రం దిల్లీకి కేసీఆర్‌ బృందం

తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి తెరాస 

Updated : 21 Mar 2022 13:25 IST

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంస్‌ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోలు చేసేలా దిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వంపై పోరుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలను కేసీఆర్‌ ప్రకటించే అవకాశముంది. తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం సాయంత్రం సీఎం, మంత్రుల బృందం దిల్లీ వెళ్లనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని