Harish Rao: దక్షిణాది నుంచి భాజపా పతనం ప్రారంభమైంది: హరీశ్‌రావు

దక్షిణాది నుంచి భాజపా పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 13 May 2023 19:26 IST

హైదరాబాద్‌: దక్షిణాది నుంచి భాజపా పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో భాజపాకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పుతో భాజపా నుంచి దక్షిణ భారతదేశానికి విముక్తి లభించిందన్న హరీశ్‌రావు.. ఈ చరిత్ర కొనసాగుతుందని ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 136, భాజపా 64, జేడీఎస్‌ 20, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని