Arvind Kejriwal: అర్వింద్ కేజ్రీవాల్-ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. కీలక చర్చ?
దిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రులు, ఆప్ ఎంపీలతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ముంబయిలో భేటీ అయ్యారు. దేశంలోని పరిస్థితులను గురించి చర్చినట్లు వెల్లడించారు.
ముంబయి: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagvanth Mann), ఆప్ పార్టీ ఎంపీలతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముంబయిలోని ఠాక్రే నివాసం మాతోశ్రీలో ఈ నేతలంతా సమావేశమై దేశంలోని పరిస్థితులను గురించి చర్చించారు. ‘‘ దేశాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఏం చేయాలన్న అంశంపై చర్చించామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధి విషయంలో తామందరిదీ ఒకటే భావజాలమని చెప్పారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ దేశంలో యువతకు సరైన ఉద్యోగాలు దొరకట్లేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. ఓ వైపు ఖర్చులు పెరుగుతున్నా.. దానికి తగ్గట్లు ఆదాయం మాత్రం పెరగడం లేదు.’’ అని కేజ్రీవాల్ అన్నారు. కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను అప్పట్లో ఉద్ధవ్ ప్రభుత్వం ముంబయిలో నేర్పుతో ఎదుర్కొందని చెప్పిన కేజ్రీవాల్.. అదే వ్యూహాన్ని దిల్లీలోనూ అమలు చేశామని అన్నారు.
సమావేశం అనంతరం ఆప్ నేతలకు ధన్యవాదాలు చెబుతూ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ట్విటర్లో పోస్టు చేశారు. ఆతిథ్యాన్ని మన్నించి తేనీరు సేవించేందుకు వచ్చిన దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు, ఆప్ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు మించి సమావేశం గురించిన వివరాలను ఆప్గానీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం గానీ వెల్లడించలేదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం కాంగ్రెస్తో పొత్తులో ఉంది. మరోవైపు దిల్లీ, పంజాబ్లో ఆప్ పార్టీతో కాంగ్రెస్కు విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేతో ఆప్ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!