Uddhav Thackeray: మనసు విప్పి మాట్లాడుతున్నా.. సీఎం అవుతానని నేనెప్పుడు అనుకోలేదు..!
మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde) వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రయత్నాలు ప్రారంభించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిలుపుకొనేందుకు ఠాక్రే ప్రయత్నాలు
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde) వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. వారు పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. శివసేన(shiv sena), ఠాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. అలాగే తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి గురించి కలగనలేదన్నారు.
‘శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. వారు పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి గురించి నేనెందుకు బాధపడతా. శివసేన, ఠాక్రే పేరు వాడకుండా వారు ఎంతదూరం వెళ్లగలరు. శిందే తన కుమారుడిని ఎంపీని చేస్తారు. కానీ, నా బిడ్డతో ఆయనకు ఎందుకు సమస్య. నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కొంతమంది నేనిక కోలుకోలేనుకుంటున్నారు. కానీ నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు’ అంటూ ఠాక్రే ఉద్వేగంగా మాట్లాడారు.
మనసు విప్పి మాట్లాడుతున్నా..
‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. దానిని ఎలాగో తట్టుకొని ముందుకు వెళ్తుంటే.. నాకు మెడనొప్పి ప్రారంభమైంది. ఈ రోజు నేను నా మనసు విప్పి మాట్లాడుతున్నాను. నేను వర్ష(అధికారిక నివాసం) వదిలి వచ్చాను. అంటే నేను పోరాటాన్ని వదిలేసినట్లు కాదు. పదవుల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని కాదు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఏనాడు ఊహించలేదు’ అని అన్నారు.
మా అమ్మ ఎంతగానో బాధపడింది: ఆదిత్య ఠాక్రే
‘మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంత బాధగా ఉండేది కాదని మా అమ్మ వాపోయింది. మన వల్ల ఎదిగిన మనవాళ్లు మనకు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని వారు లాభం పొందారు’ అంటూ అసమ్మతి నేతలపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
అస్సాంలోని గువాహటి హోటల్ నుంచే ఏక్నాథ్ శిందే తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రులతో కలిసి ఆ సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. అంతేగాకుండా 400 మంది మాజీ కార్పొరేటర్లతో కూడా శిందే వర్గం భేటీ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఠాక్రే కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఉద్ధవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మున్ముందు ఎంపీలు, కార్పొరేటర్లు కూడా అసమ్మతి వర్గంతో వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న బీఎంసీ ఎన్నికలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్