Siddaramaiah: అంతా అబద్ధం.. తమిళనాడుకు ఒక్క నీటిబొట్టునూ వదలం: సిద్ధరామయ్య
బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ భాజపా చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనన్నారు.
చామరాజనగర్: బెంగళూరు (Bengaluru) నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు ప్రతిపక్ష భాజపా (BJP) చేస్తోన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు. తమ రాష్ట్రంలో నీటికొరత ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నీటిబొట్టును కూడా తమిళనాడుకు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. చామరాజనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అదంతా అబద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నీళ్లు ఇస్తారు? మన వినియోగానికి నీటిని ఉంచుకోకుండా తమిళనాడుకు చుక్క నీరు కూడా ఇవ్వం. తమిళనాడు మమ్మల్ని అడగనప్పుడు మేం నీళ్లు ఎందుకు ఇస్తాం? వారికి ఇవ్వడానికి అసలు మన దగ్గర నీరు ఎక్కడ ఉంది? తమిళనాడు అడిగినా, కేంద్రం లేదా ఇంకెవరైనా నీరు విడుదల చేయాలని కోరినా వాళ్లకు ఇచ్చే ప్రశ్నే లేదు’’ అని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.
శరత్ కుమార్ కీలక నిర్ణయం.. భాజపాలో ఏఐఎస్ఎంకే విలీనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. వేసవి ప్రారంభంలోనే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తోందంటూ కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక సోమవారం ఆరోపణలు చేశారు. తక్షణమే నీటి విడుదలను ఆపాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన సిద్ధరామయ్య.. అవన్నీ అవాస్తవాలేనని.. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!