Khushboo: నటి గాయత్రీ రఘురామ్ ఆరోపణలను ఖండించిన ఖుష్బూ
భాజపాలో మహిళలకు భద్రత లేదంటూ ఇటీవల సినీనటి గాయత్రీ రఘురామ్ చేసిన ఆరోపణల్ని ఆ పార్టీ సీనియర్ నేత ఖుష్బూ సుందర్ ఖండించారు. మహిళలంతా తమ పార్టీని వీడటంలేదని.. తానూ ఆ పార్టీలోనే కదా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించారు.
కోయంబత్తూరు: తమిళనాడు భాజపా(BJP)లో మహిళలకు గౌరవం, భద్రత లేవంటూ ఇటీవల నటి గాయత్రీ రఘురామ్(Gayathri Raghuramm) చేసిన ఆరోపణలను ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Khushboo Sundar)ఖండించారు. ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన సందర్భంగా గాయత్రి చేసిన ఆరోపణల్ని ఖండించారు. రాష్ట్రంలోని భాజపాలో మహిళలకు గౌరవం, రక్షణ ఉన్నాయన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఆదివారం వెల్లలూరులో సంప్రదాయ ఎడ్ల బండి పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భాజపాలో మహిళలకు భద్రత ఉందన్నారు. మహిళలంతా తమ పార్టీని వీడటంలేదని, తాను కూడా ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలై ధైర్యంగా, బలమైన నిర్ణయాలు తీసుకుంటూ తనకు మద్దతుగా పోరాటం చేశారని కొనియాడారు.
రాష్ట్రాన్ని తమిళగం లేదా తమిళనాడు అని పిలిచినా తప్పులేదన్న ఖుష్బూ.. తాను ముంబయిలో పుట్టినా తమిళ మహిళనేనన్నారు. గత 36 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చారు. సంక్రాంతి కానుకగా చెరకు, రూ.1000లను డీఎంకే ప్రభుత్వం ఓ భిక్షలా ఇస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అంతకుముందు ఎడ్లబండిపై కొద్దిదూరం పాటు ప్రయాణించిన ఖుష్బూ అందరినీ ఉత్సాహపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!