Karnataka Elections: యడియూరప్ప రేసులో ఉంటే ఫలితం మరోలా ఉండేదా?
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రాన్ని భాజపా కోల్పోయింది. అయితే, కన్నడ సీమలో కాషాయ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన యడియూరప్ప రేసులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం : దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక(Karnataka)లో భాజపా(BJP) పరాజయం పాలైంది. దీంతో దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోనూ లేనట్టయింది. గత మూడు దశాబ్దాల నుంచి కర్ణాటకలో భాజపా ప్రాబల్యం బాగా విస్తరించింది. ఈ విస్తరణ వెనుక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Yediyurappa) కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.
నాలుగు సార్లు సీఎంగా...
రాష్ట్రంలో భాజపాను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసిన యడియూరప్ప భాజపాను గణనీయ శక్తిగా రూపొందించారు. రాష్ట్రంలో బలీయమైన లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్ప అత్యంత జనాకర్షణ ఉన్న నేతల్లో ఒకరు. అయితే 2021లో 75 ఏళ్ల నిబంధన ప్రకారం భాజపా ఆయనను తప్పించి బస్వరాజ్ బొమ్మైకు పగ్గాలు అప్పగించింది. ఆయన మౌనంగా ఉన్నా ఓటర్లు, అభిమానులు మాత్రం ఈ మార్పును అంగీకరించలేదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
గతంలోనూ అనుభవమే..
2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా నుంచి వెళ్లిపోయిన యడియూరప్ప కర్ణాటక జనతా పక్ష అనే రాజకీయ పక్షాన్ని స్థాపించారు. ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భాజపా కేవలం 40 సీట్లకే పరిమితమైంది. అనంతరం 2014లో సొంతగూటికి చేరుకున్న యడియూరప్ప నాయకత్వంలో భాజపా లోక్సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 104 సీట్లు సాధించింది. 2019లో కొవిడ్ నియంత్రణలో విఫలమయ్యారన్న ఆరోపణలు రావడం, వయోభారం కారణంగా భాజపా అగ్రనాయకత్వం ఆయన్ను పక్కకు తప్పించి బొమ్మైకు సీఎం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
యాత్రల ద్వారా ఓటర్లకు చేరువై..
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కర్ణాటక రాజకీయాల్లో కీలక శక్తిగా ఉన్న యడియూరప్ప అనేక యాత్రల ద్వారా భాజపాను ప్రధాన పక్షాల్లో ఒక్కటిగా మార్చారు. సైకిల్ యాత్ర, సంకల్ప్యాత్ర, సేవ్ కావేరి యాత్ర, కిసాన్యాత్రలతో రాష్ట్రప్రజలకు మరింత చేరువయ్యారు. కర్ణాటకలో భాజపాకు ఆయన పెద్ద అండగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా లేకపోవడం కూడా ఓటర్లపై ప్రభావం చూపించింది.
కుమారుడికి మంత్రి పదవి లభించలేదు..
2021లో సీఎం పదవి నుంచి దిగిపోయిన అనంతరం యడియూరప్ప తన కుమారుడు విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానమివ్వాలని కోరారు. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు. ఆయన ఇంకో కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ నుంచి ఎంపీగా ఉన్నారు. విజయేంద్రకు మంత్రిపదవి లభించివుంటే యడియూరప్ప అభిమానులు భాజపాకు మద్దతు పలికివుండేవారు. అయితే భాజపా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. యడియూరప్ప స్థానాన్ని భర్తీచేసే రాష్ట్రనాయకుడు భాజపాలో లేకపోవడం భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!