Yogi Adityanath: భాజపాకు ఓటెయ్యకపోతే.. యూపీ కూడా ఓ కశ్మీర్, బెంగాల్లాగే..!
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడత పోలింగ్లో భాగంగా గురువారం 58 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. అయితే పోలింగ్కు కొద్ది
తొలి విడత ఓటింగ్కు ముందు యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. తొలి విడత పోలింగ్లో భాగంగా గురువారం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అయితే, పోలింగ్కు కొద్ది గంటల ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు ఓటేయ్యకుండా తప్పు చేస్తే.. ఉత్తరప్రదేశ్ కూడా ఓ కశ్మీర్, కేరళ, బెంగాల్లా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
‘‘నా మనసులో ఉన్న ఓ మాట చెప్పాలనుకుంటున్నా. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరిగాయి. ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే ఈ ఐదేళ్ల శ్రమ వృథా అవుతుంది. అప్పుడు యూపీ కూడా ఓ కశ్మీర్, కేరళ, బెంగాల్లా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఈ ఐదేళ్ల నా కృషికి మీ ఓటే ఆశీర్వాదం. మీరు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి కూడా మీ ఓటే ఓ గ్యారెంటీ. ఈ ఐదేళ్లలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ఓట్లు అడగడానికి మీ ముందుకు రాలేదు. కానీ, గత ప్రభుత్వాలు ఇవన్నీ చేయలేకపోయినందుకు వారి తరపున క్షమించమని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఓ పెద్ద నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది’’ అని యోగి ఆ వీడియోలో ఓటర్లను కోరారు. ఈ వీడియోను భాజపా ఉత్తరప్రదేశ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
భయం నుంచి విముక్తి కలిగించేలా..
అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా యూపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్వీట్ చేశారు. ‘‘అన్ని భయాల నుంచి దేశానికి విముక్తి కల్పించండి. రండి ఓటేయ్యండి’’ అని రాసుకొచ్చారు.
403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా గురువారం 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 2017 ఎన్నికల్లో ఈ 58 నియోజకవర్గాల్లో 53 చోట్ల భాజపా జయకేతనం ఎగురవేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!