వైఎస్ఆర్ జనం కోసం జీవించారు: విజయమ్మ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘శత్రువులైనా, ప్రత్యర్థులైనా వైఎస్ఆర్ను అభిమానించారు. నాయకుడంటే వైఎస్ఆర్లా ఉండాలి. ఆయన మరణంలేని నాయకుడు. తెలంగాణలో వైఎస్ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. వైఎస్ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలుగువారి గుండె చప్పుడు వైఎస్. షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నమస్సులు. జగన్, షర్మిల వైఎస్ ఆత్మీయత, హావభావాలు పుణికిపుచ్చుకున్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలు, పార్టీలకు ప్రతినిధులు. తెలంగాణలో వైఎస్ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయి. తండ్రి కల సాకారం చేసేందుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి ఆశయ సాధన కోసం మీ ముందుకు వస్తోంది. మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకోండి’’ అని విజయమ్మ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి