YS Sharmila: తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు? అది సాధ్యమా?: షర్మిల
బంగారు తెలంగాణ కాదు.. ఇది బానిసత్వపు తెలంగాణ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
హైదరాబాద్: బంగారు తెలంగాణ కాదు.. ఇది బానిసత్వపు తెలంగాణ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 59ఏళ్లు దాటిన రైతుకు బీమా ఎందుకు వర్తించట్లేదని ప్రశ్నించారు. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించామని.. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు.
‘‘ తెలంగాణలో 66లక్షల మంది రైతులుంటే 41లక్షల మందికే బీమా వర్తింపా? 59ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా? కౌలు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎల్ఐసీలో 70ఏళ్లు పైబడిన వారికీ పాలసీలు ఉన్నాయి. పాలసీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలని కోరాం. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు? అది సాధ్యమా? ప్రజలను రెచ్చగొట్టేందుకు మంత్రి కేటీఆర్ విలీనం గురించి మాట్లాడుతున్నారు’’ అని షర్మిల అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి