పార్టీ నేత అసభ్యపదజాలంతో దూషించాడని..

పార్టీ జిల్లా అధ్యక్షుడు తనను అసభ్యపదజాలంతో దూషించారని పేర్కొంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని

Published : 28 Jan 2022 10:53 IST

యూపీలో పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్‌ మహిళా అభ్యర్థి

బుఢ్వాన్‌: పార్టీ జిల్లా అధ్యక్షుడు తనను అసభ్యపదజాలంతో దూషించారని పేర్కొంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షేకూపుర అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఫర్హా నయీమ్‌ పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ‘‘మహిళలు పోరాడగలరని ప్రియాంక గాంధీ నాకు టికెటిచ్చారు. కానీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓంకార్‌ నన్ను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. పార్టీలో పెద్దలకు చెప్పినా ఫలితం లేకపోయింది. అందుకే పోటీ నుంచి వైదొలగుతున్నాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నాను’’ అని గురువారం ఫర్హా విలేకరుల సమావేశంలో తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని