నా విజయాలతో అతడు గర్వపడేలా చేస్తా : ఒసాకా
తన విజయాలతో ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రియంట్ను గర్వపడేలా చేస్తానని యూఎస్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్...
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రియంట్ను తన విజయాలతో గర్వపడేలా చేస్తానని యూఎస్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ విభాగం విజేత నవోమీ ఒసాకా అన్నారు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అయిన ఒసాకా.. బెలారస్కు చెందిన విక్టోరియా అజెరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ సాధించగా రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ దివంగత బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రియంట్ను గుర్తుచేసుకున్నారు.
‘నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. వాటితో బ్రియంట్ను గర్వపడేలా చేస్తానని అనుకుంటున్నా. అతడి స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని ఉంది. అలాగే ఎంతో మంది క్రీడాకారులకు అతడు ప్రేరణగా నిలవడం అద్భుతం. అతడి గురించి మాట్లాడితే ప్రతీ ఒక్కరూ మంచి విషయాలే చెబుతారు. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. బ్రియంట్ కూడా నా నుంచి అదే ఆశించాడు. నేనెంతో ఎత్తుకు ఎదుగుతానని అతడనుకున్నాడు. కాబట్టి భవిష్యత్లో మరింత ఎత్తుకు ఎదుగుతానని నమ్ముతున్నా. అదంతా కాలమే చూసుకుంటుంది’ అని ఒసాకా అన్నారు.
అలాగే తన అనుభవాలతో, క్వారంటైన్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నానని, తన పరిస్థితులు ఇతరులతో పంచుకోవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం లాంటివి తనకెంతో ముఖ్యమని చెప్పారు. ఒక క్రీడాకారిణిగా క్వారంటైన్ సమయం తనకెంతో మేలు చేసిందని, మిగతా సమయంలో దృష్టి సారించలేని విషయాలను ఇప్పుడు నేర్చుకోగలిగినట్లు అన్నారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికి ఇదెంతో తోడ్పడిందని వివరించారు. కాగా, 2018లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలుపొందిన ఒసాకా 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది. ఇప్పుడు కెరీర్లో మూడో గ్రాండ్ స్లామ్తో పాటు రెండోసారి ఈ టైటిల్ను అందిపుచ్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!