పుట్టిన రోజు నాడు నవ్‌దీప్‌ తప్పించుకున్నాడు..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, టీమ్‌ఇండియా క్రికెటర్‌ నవ్‌దీప్‌ సైని సోమవారం 28వ వసంతంలోకి అడుగెట్టాడు. ఈ సందర్భంగా తోటి క్రికెటర్ల నుంచి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

Published : 23 Nov 2020 23:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, టీమ్‌ఇండియా క్రికెటర్‌ నవ్‌దీప్‌ సైని సోమవారం 28వ వసంతంలోకి అడుగెట్టాడు. ఈ సందర్భంగా తోటి క్రికెటర్ల నుంచి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐ సైతం సైనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. ట్విటర్‌లో అతడి ఫొటోలు పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. అలాగే ఓ టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై అతడు తీసిన మూడు వికెట్ల ప్రదర్శన వీడియో లింక్‌ను కూడా షేర్‌ చేసింది. 

 బీసీసీఐ మరో ట్వీట్‌ చేసి అతడికి రెండోసారి శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న అతడు తోటి ఆటగాళ్లతో కలిసి కేక్‌ కట్‌చేశాడు. ఆ ఫొటోను పంచుకొని పుట్టిన రోజు వేడుకల్లో అక్కడ కేక్‌ రుద్దడం నిషేధమని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సహచరులు సైతం మాస్కులు ధరించి ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వాళ్లు సైనీకి కేక్‌ రుద్దలేకపోయారు. మరోవైపు ఇటీవల యూఏఈలో జరిగిన టీ20 లీగ్‌లో ఆటగాళ్ల పుట్టిన రోజు వేడుకల్లో ఎంతో ఎంజాయ్‌ చేశారు. వాళ్లంతా బయోబబుల్‌ నిబంధనల్లో ఉండడంతో అక్కడి అధికారులు వేడుకలకు ఎలాంటి షరతులు విధించలేదు. దాంతో బర్త్‌డే బాయ్‌లకు కేక్‌ పూసి సంబరాలు చేసుకున్నారు. ఇటీవల బెంగళూరు జట్టులో ఆడిన సైని మొత్తం 13 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు వికెట్లే పడగొట్టాడు. అయినా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని