రఫేల్.. రప్ఫాడిస్తాయ్: సచిన్
భారత భూభాగంపై అడుగు పెట్టిన శత్రు భయంకర రఫేల్ యుద్ధ విమానాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ స్వాగతం చెప్పారు. వీటి చేరికతో మన పోరాట సామర్థ్యం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. భారత వాయుసేనకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.......
ఇంటర్నెట్ డెస్క్: భారత భూభాగంపై అడుగు పెట్టిన శత్రు భయంకర రఫేల్ యుద్ధ విమానాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ స్వాగతం చెప్పారు. వీటి చేరికతో మన పోరాట సామర్థ్యం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. భారత వాయుసేనకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘రఫేల్ యుద్ధ విమానాలు మన సైన్యంలో భాగమైనందుకు భారత వైమానిక దళానికి హృదయపూర్వక అభినందనలు. విశ్రాంతి లేకుండా గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన సైనిక బలగాలు ఇప్పుడు మరింత ఉన్నతీకరణ చెందాయి. జై హింద్’ అని సచిన్ ట్వీట్ చేశారు. తెందూల్కర్కు వాయుసేనతో అనుబంధం ఉండటం గమనార్హం. అంతకు ముందు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వాయుసేనకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.
శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే సామర్థ్యం రఫేల్ యుద్ధ విమానాల సొంతం. అణ్వస్త్రాలతో దాడిచేయగల సామర్థ్యం ఉన్న ఇవి చైనా, పాకిస్థాన్ సరిహద్దు వివాదాల నేపథ్యంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ కంపెనీ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలుకు ఎన్డీయే ప్రభుత్వం 2016లో రూ.59వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి యూఏఈకి చేరుకొని అక్కడి నుంచి అంబాలకు బుధవారం చేరుకున్నాయి. వీటికి ఎస్కార్టులుగా రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.