Paralympics: 18 ఏళ్లకే పతకం.. హైజంప్లో అదరగొట్టిన ప్రవీణ్
పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్లో
టోక్యో: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్లో ప్రవీణ్కుమార్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు రజతం సాధించిన ప్రవీణ్కుమార్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రవీణ్ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని చెప్పారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
శుక్రవారం జరిగిన టి64 హైజంప్లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశాడు. పారాలింపిక్స్ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. 2.07 మీటర్లు గెంతి సరికొత్త ఆసియా రికార్డు సృష్టించాడు. స్వర్ణం అందుకున్న జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు గెంతడం గమనార్హం. కాగా భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే పతకం అందుకున్నది కుమారే (18 ఏళ్లు) కావడం ప్రత్యేకం.
ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నోయిడాకు చెందిన అతడు 2019లో ఈ క్రీడలో అడుగుపెట్టాడు. అదే ఏడాది జూనియర్ పారా ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం ముద్దాడాడు. కొన్నేళ్లుగా అతడు జాతీయ కోచ్ సత్యపాల్ సింగ్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటున్నాడు. బాల్యం నుంచి అతడు సాధారణ అథ్లెట్లతోనే పోటీపడటం గమనార్హం.
మోదీ ప్రశంసలు
అద్భుత ప్రదర్శన చేసిన ప్రవీణ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతడి అంకితభావం, పట్టుదలకు ఈ పతకం నిదర్శనమని పొగిడారు. ‘పారాలింపిక్స్లో రజతం గెలిచిన ప్రవీణ్ను చూసి గర్విస్తున్నాను. అతడి అకుంఠిత దీక్ష, అంకితభావం, శ్రమకు ఈ పతకమే నిదర్శనం. అతడికి అభినందనలు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక