2006లోనే రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు: లక్ష్మణ్
కెప్టెన్ కూల్గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ అంతే కూల్గా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్ఇండియాకు...
మా అందరినీ కూర్చోబెట్టుకొని బస్సులో తీసుకెళ్లాడు
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్ కూల్గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ అంతే కూల్గా రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సందర్భంగా ప్రతీఒక్కరూ అతడు టీమ్ఇండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని మాట్లాడుతున్నారు. అయితే, తాను ఆడే రోజుల్లో మహీలోని మరో కోణాన్ని చూశానని చెప్పాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్. మాజీ సారథి రిటైర్మెంట్ అనంతరం స్టార్స్పోర్ట్స్ ‘క్రికెట్ కనెక్టెడ్’ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్తో మాట్లాడుతూ రెండు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోనీ చేసిన ఆ రెండు విశేషాలు తానెప్పటికీ మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు.
ధోనీ 2006లో పాకిస్థాన్పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ నివ్వెరపరిచాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ‘‘పాక్ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్లో జరిగిన రెండో టెస్టులో మహీ ఈ ఫార్మాట్లో తొలి శతకం బాదాడు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి గట్టిగా ఇలా అరిచాడు. ‘నేనిప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఎంఎస్ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్లో ఇంతకుమించి నాకేం వద్దు’ అని చెప్పాడు. మేమంతా ఒక్కసారిగా అలా చూస్తుండిపోయాం’’ అని వీవీఎస్ వివరించాడు. అలాగే మరోసారి టీమ్ఇండియా సారథిగా ఉన్నప్పుడూ జట్టు మొత్తాన్ని అయోమయానికి గురిచేశాడని చెప్పాడు. 2008లో నాగ్పూర్లో టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు ఒక రోజు మైదానం నుంచి హోటల్ వరకు బస్సును నడిపాడని చెప్పాడు. డ్రైవర్ను వెనక్కి వెళ్లమని చెప్పి అందరినీ తీసుకొని హోటల్ వరకు తీసుకెళ్లాడని వివరించాడు. ధోనీ అంటే అంతగా కలిసిపోతాడని, బయట జీవితాన్ని సరదాగా గడుపుతాడని పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
ఆటలో మెరిసి..మా మదిలో నిలిచి..థాంక్యూ వైజాగ్!
మహి చూపినదారిలో..
కన్నీళ్లు దాచుకునే ఉంటావ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?