IND vs AUS: భారత్ X ఆసీస్ నాలుగో టెస్టు.. అహ్మదాబాద్ పిచ్ తీరేంటో..?
స్పిన్ పిచ్తో ఆసీస్ను ఇబ్బంది పెడదామని భావించిన టీమ్ఇండియా (Team India) మూడో టెస్టు మ్యాచ్లో ఓటమిపాలైంది. దీంతో నాలుగో టెస్టుకు (IND vs AUS) పిచ్ సన్నద్ధతపై ఇరకాటంలో పడింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో టీమ్ఇండియా ((Team India) ఉండగా.. చివరి మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎలాంటి పిచ్ను తయారు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి మూడు టెస్టుల్లో స్పిన్ ట్రాక్ వాడేసిన విషయం తెలిసిందే. అయితే, రెండు టెస్టుల్లో గెలిచిన టీమ్ఇండియాకు మూడో మ్యాచ్లో మాత్రం చుక్కెదురైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుని.. నాలుగో టెస్టుకు ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్ను సిద్ధం చేసుకోవాలని టీమ్ఇండియా తొలుత భావించింది. తీరా, ఇప్పుడు విజయం కీలకం కావడంతో స్పిన్ పిచ్ను సిద్ధం చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు పిచ్ పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం పిచ్కు సంబంధించిన ఫొటోలు దర్శనమిచ్చాయి. బీసీసీఐ నుంచి తమకెలాంటి సూచనలు రాలేదని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ క్యూరేటర్లు తెలిపారు. దీంతో అటు ఆసీస్, ఇటు భారత జట్టు శిబిరాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో టాస్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. నాలుగో టెస్టుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బానెస్ హాజరవవుతారు.
క్రీజ్లో పాతుకుపోతే..
గత గణాంకాలను పరిశీలిస్తే.. అహ్మదాబాద్ పిచ్ స్పిన్ బౌలింగ్కు పూర్తిగా అనుకూలంగా ఉంది. స్టేడియం పునర్నిర్మాణం తర్వాత ఇక్కడ రెండు టెస్టులు జరిగాయి. ఆ రెండూ ఇంగ్లాండ్తోనే కావడం విశేషం. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో కలిసి లోకల్ బాయ్ అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ను శాసించాడు. మొత్తం 40 వికెట్లలో 35 వికెట్లను వీరిద్దరే పడగొట్టారు. అలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కూడా పార్ట్టైమ్స్పిన్ బౌలింగ్తో ఐదు వికెట్ల (5/8) ప్రదర్శన చేయడం గమనార్హం. ఇటీవల రంజీ మ్యాచ్లో రైల్వేస్ జట్టు ఏకంగా 508 పరుగులు సాధించింది. కానీ, గుజరాత్ మాత్రం రెండు ఇన్నింగ్స్ల్లోనూ 200+ పరుగులు సాధించి ఇన్నింగ్స్తేడాతో ఓటమిపాలైంది. కాబట్టి, బ్యాటర్ క్రీజ్లో పాతుకుపోతే మాత్రం పరుగులు సాధించడం పెద్ద కష్టం కాదని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?