Ashwin - Kumble: రికార్డులు బద్దలు.. అశ్విన్పై కుంబ్లే స్పెషల్ ట్వీట్
క్రికెట్లో ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొట్టడం సహజం. రికార్డులు సృష్టించిన క్రికెటర్లను క్రీడాస్ఫూర్తితో మెచ్చుకోవాలి. ఇప్పుడు టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేసిందదే.. అశ్విన్ (Ashwin) తన రెండు రికార్డులను బద్దలు కొట్టడటంతో ప్రత్యేకంగా అభినందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో టీమ్ఇండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా నాలుగో టెస్టులోనూ (IND vs AUS) అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు చెందిన రెండు రికార్డులను అశ్విన్ అధిగమించాడు. దీంతో క్రికెట్ ప్రపంచమంతా అశ్విన్ను పొగడ్తలతో ముంచెత్తింది. తాజాగా అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. ‘‘అశ్విన్ది అద్భుతమైన బౌలింగ్. అతడో క్లాసిక్ ప్లేయర్’’ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.
ఆసీస్పై నాలుగో టెస్టులో 91 పరుగులకు అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. దీంతో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ అవతరించాడు. ఇప్పటి వరకు అశ్విన్ 113 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ బౌలర్గా అనిల్ కుంబ్లే (111) పేరిట ఉన్న ఈ రికార్డును అశ్విన్ అధిగమించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లను స్వదేశం వేదికగా 26వ సారి అశ్విన్ పడగొట్టాడు. ఇందులోనూ అనిల్ కుంబ్లేను అధిగమించాడు. అయితే, అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ (473) 9వ బౌలర్గా ఉన్నాడు. అనిల్ కుంబ్లే (619) ఐదో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
ఆసీస్తో నాలుగో టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 341/4 (125)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.