MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి సంబంధించిన ఆహారపు అలవాట్ల గురించి మాజీ క్రికెటర్ ఉతప్ప(Robin Uthappa) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తినే విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించేవాడని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).. ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడతాడో తెలిసిందే. 41 ఏళ్ల వయసులో కూడా ఫిట్గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్(IPL) సీజన్ కోసం ధోనీ చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా.. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa).. ధోనీ ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. బటర్ చికెన్(Butter Chicken)ను ఆర్డర్ చేసి.. దానిని ఎలా తినేవాడో వివరించాడు.
‘రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, పియూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ధోనీ, నేను.. మేమంతా ఓ గ్రూప్. అప్పుడప్పుడూ అందరం కలిసి హోటల్కు వెళ్లి తినేవాళ్లం. దాల్ మఖనీ, బటర్ చికెన్, జీరా ఆలూ, గోబీ, రోటీలు ఆర్డర్ చేసే వాళ్లం. అయితే.. ధోనీ మాత్రం తినే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. బటర్ చికెన్ ఆర్డర్ చేసి.. చికెన్ తినకుండా కేవలం గ్రేవీ మాత్రమే తినేవాడు. ఒక వేళ చికెన్ తినాలనుకుంటే.. రోటీలను పక్కనపెట్టేవాడు. తినే విషయంలో తాను కాస్త విచిత్రంగా ఉండేవాడు’ అని ఉతప్ప ఓ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.
ఇక సహచర ఆటగాళ్లతో ధోనీ(MS Dhoni) ఏంతో ఫ్రేండ్లీగా ఉంటాడని.. తనను మహీ అని పిలవాలని.. మహీ భాయ్ అనాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్నీ ఉతప్ప గుర్తు చేసుకున్నాడు.
ధోనీ ఆ విషయాల్లో ముక్కుసూటిగా ఉంటాడు..
ఇక 14వ ఎడిషన్ ఐపీఎల్కు ముందు ధోనీతో తనకు జరిగిన ఓ ఘటనను ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. తన సహచర ఆటగాళ్లతో కొన్ని విషయాలను ధోనీ ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగానే చెబుతాడని తెలిపాడు. ‘‘ధోనీ చాలా ఓపెన్గా ఉంటాడు. మీకు బాధ కలిగించినా.. నిజాలు తెలియజేయడంలో వెనుకాడడు. వేలంలో చెన్నై జట్టు నన్ను తీసుకున్నప్పుడు.. ధోనీ నన్ను పిలిచాడు. ‘మీకు ఆడే అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సీజన్ ఇంకా చాలా దూరంలో ఉంది. నేను దాని గురించి ఆలోచించడం లేదు. మీరు తుది జట్టులో ఉంటే.. నేను మీకు తెలియజేస్తాను’’ అని ధోనీ నాతో అన్నాడు. ఐపీఎల్లో 13 సంవత్సరాలు విజయవంతంగా ఆడిన అనుభవం నాకు ఉంది. అయినప్పటికీ.. ధోనీ తాను ఏం చేయాలనుకుంటున్నాడో నా ముఖం మీదే చెప్పాడు. అందుకు ధోనీని నేను ఇప్పటికీ అభినందిస్తున్నాను’ అని ఉతప్ప వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?