WPL: చివరిమెట్టుపై ఆర్సీబీ బోల్తా.. ఒక పరుగు తేడాతో దిల్లీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
దిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా ఆర్సీబీ (RCB Women)తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital Women) కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవడానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రిచా ఘోష్ (51: 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) రనౌట్ కావడంతో దిల్లీ గెలుపొందింది. బెంగళూరు బ్యాటర్లలో ఎలిస్ పెర్రీ(49), సోఫీ మోలినెక్స్ (33), సోఫీ డివైన్ (26) విలువైన పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో మారిజానె కాప్, ఎలిస్ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్ తీశారు.
చెలరేగిన రిచా ఘోష్.. తారాస్థాయికి ఉత్కంఠ
17 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 142 పరుగులతో నిలిచిన ఆర్సీబీ.. విజయం దిశగా వెళుతుందని ఎవరూ ఊహించలేదు. మూడో ఓవర్లలో బెంగళూరు విజయ లక్ష్యం 40 పరుగులుగా ఉంది. అప్పటికే 25 పరుగులతో ఉన్న రిచా ఘోష్ అనూహ్యంగా చెలరేగింది. 18వ ఓవర్ చివరి బంతికి సోషీ డివైన్ ఔట్ అయినప్పటికీ మిగతావారి సహకారంతో దూకుడుగా ఆడింది. 18, 19 ఓవర్లలో మొత్తం 23 పరుగులు రావడంతో చివరి ఓవర్ లక్ష్యం 17 పరుగులుగా మారింది. 20 ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన రీచా.. రెండో బంతికి పరుగులు తీయలేదు. మూడో బంతికి పరుగు తీసే క్రమంలో దిశా కాసత్ రనౌట్ అయింది. దీంతో లక్ష్యం మూడు బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి రీచా మళ్లీ సిక్స్ కొట్టింది. సమీకరణం చివరి బంతికి రెండు పరుగులు. ఇరుజట్లతో పాటు మ్యాచ్ చూస్తున్న వారిలో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రిచా రనౌట్ అవడంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి.
అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (29), షఫాలీ వర్మ (23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్ (58; 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరిసింది. అలీస్ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8 ఫోర్లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్