pak vs eng: ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అస్వస్థత.. పాక్తో తొలి మ్యాచ్ అనుమానమే..
పాక్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలున్నాయి.
రావల్పిండి: సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని అంతరాయం ఏర్పడింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా గురువారం రావల్పిండిలో జరగనున్న తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా సగం మంది ఆటగాళ్లు గుర్తు తెలియని వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతున్నారని పాక్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని.. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పీసీబీ తెలిపింది. ఈ విషయంపై ఇంగ్లాండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో చర్చిస్తున్నట్టుగా పేర్కొంది. ఆటగాళ్లు అస్వస్థతకు గురైన విషయం నిజమేనని మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు. అయితే మ్యాచ్ ముంగిట జట్టులో ఏవైనా మార్పులు చేస్తారా? అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఈసీబీ ప్రతినిధి డానీ రూబెన్ మాట్లాడుతూ.. ‘‘ఏడు మంది ఆటగాళ్లు సహా తమ బృందంలోని 14 మంది వరకు వైరస్ బారినపడ్డారు. అయితే, ఇది ఫుడ్ పాయిజన్, కరోనాకు సంబంధించినది కాదు’’ అని తెలిపాడు. ఈ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. కరాచీలో 17-21 మధ్య చివరి మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.