Babar azam: మిడిలార్డర్లో ఎందుకు ఆడడో అర్థం కాదు.. బాబర్ వల్లే పాక్ నష్టపోతోంది: డానిష్ కనేరియా
బాబర్ కేవలం ఇన్నింగ్స్ ప్రారంభించడానికే ఆసక్తి చూపుతున్నాడని, మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు ఇష్టపడటంలేదని పాక్ మాజీ కెప్టెన్ డానిష్ కనేరియా విమర్శలు గుప్పించాడు.
దిల్లీ: టీ20 ప్రపంచకప్ ఆరంభంలోనే రెండు ఓటములను నమోదు చేసిన పాకిస్థాన్ అనూహ్యంగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసినప్పటికీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఈ టోర్నమెంట్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్పై 53 పరుగులు మినహా మిగిలిన మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే ఈ ఆటగాడు పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ డానిష్ కనేరియా స్పందిస్తూ బాబర్పై విమర్శలు గుప్పించాడు. కేవలం ఇన్నింగ్స్ ప్రారంభించడానికే ఆసక్తి చూపుతున్నాడని, ఆర్డర్లోకి దిగడం లేదంటూ మండిపడ్డాడు. అతడి వల్ల పాక్ జట్టు నష్టపోవాల్సి వచ్చిందన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడూతూ.. విరాట్ కోహ్లీలాంటి నిస్వార్థమైన ఆటగాడిని ఇంత వరకు చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
‘‘బాబర్ అజామ్ ఓ మొండిఘటం. కరాచి జట్టుకు ఆడినప్పుడు కూడా ఇదే జరిగింది. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయలేకపోవడంతో ఓపెనర్గా ఆడేందుకే మొండి పట్టుదలతో వ్యవహరించాడు. మిడిలార్డర్లో అతడెందుకు ఆడడో అర్థం కాదు. ఇలాంటి వైఖరి వల్ల జట్టు తీవ్రంగా నష్టపోతోంది. ఒకవేళ రిజ్వాన్ రాణిస్తే బాబర్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు. తన ఇన్నింగ్స్ను సైతం చాలా నెమ్మదిగా ప్రారంభిస్తాడు. నిస్వార్థంగా ఆడే ఆటగాళ్లలో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీని మించినవారు లేరు. అతడి కెప్టెన్సీలో టీమ్ఇండియా ప్రపంచకప్ను కోల్పోయింది. ఆ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. జట్టులో అతడి స్థానంపై చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, వెనకడుగు వేయలేదు. కొత్త సారథికి పూర్తి సహకారం అందించాడు. ఏ నంబర్లో అయినా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఆసియా కప్తో సరికొత్తగా ఉద్భవించాడు’’ అంటూ కనేరియా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?