Hardik Pandya: హార్దిక్ ఇది మంచిది కాదు.. షమి మీద అరవడంపై నెటిజన్ల ఆగ్రహం
గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అతడు సీనియర్ ప్లేయర్ మహ్మద్ షమిపై చిందులు తొక్కడంతో ట్విటర్లో మండిపడుతున్నారు...
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అతడు సీనియర్ ప్లేయర్ మహ్మద్ షమిపై చిందులు తొక్కాడు. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57; 46 బంతుల్లో 2x4, 4x6) అర్ధ శతకంతో మెరిశాడు.
అయితే, హార్దిక్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి రాహుల్ త్రిపాఠి (17 రిటైర్డ్ హర్ట్; 11 బంతుల్లో 1x4, 1x6) ఆడిన భారీ షాట్ను డీప్ థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న షమి క్యాచ్ అందుకోలేకపోయాడు. అప్పటికే తన ఓవర్లో విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదడంతో గుర్రుగా ఉన్న పాండ్య.. షమి ఆ బంతిని అందుకోకపోవడంతో గట్టిగా అరిచాడు. అది టీవీలో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు వెంటనే పాండ్యపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. షమి లాంటి సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలని అన్నారు. ఇలాగే అతిగా ప్రవర్తిస్తే గుజరాత్ జట్టులో ఎవరూ ఉండరని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ టీమ్లో ఆటగాళ్లు పలు క్యాచ్లు వదిలినా విలియమ్సన్ ఎలా వ్యవహరించాడో ఒకసారి చూడాలని హితవు పలికారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు హార్దిక్పై అసహనం ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు ఇదే మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ 42 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోవడంపైనా అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ టీ20 లీగ్ చరిత్రలోనే హార్దిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి ఇన్ని బంతులు తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో అతడు నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు రావాలని సూచిస్తున్నారు. అభినవ్ మనోహర్ నాలుగో స్థానంలో రావాలని కోరుతున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి.. ధోనీ నుంచి స్ఫూర్తి పొందావా అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
అత్యధిక బంతుల్లో హార్దిక్ హాఫ్ సెంచరీలు..
* 42 బంతుల్లో హైదరాబాద్పై (ఈ మ్యాచ్లోనే)
* 2018లో బెంగళూరుపై 41 బంతులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!