Gambhir: కోహ్లీతో గొడవ.. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం: గౌతమ్ గంభీర్
సూటిగా మాట్లాడే గౌతమ్ గంభీర్.. విరాట్తో జరిగిన వాగ్వాదంపై మరోసారి స్పందించాడు. దీని గురించి ఎన్నిసార్లు అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ (Virat Kohli) మధ్య ఐపీఎల్ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో అలానే ఉండిపోయింది. లఖ్నవూ సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించిన గంభీర్ (Gautham Gambhir) తమ జట్టు ఆటగాడు నవీనుల్ హక్కు మద్దతుగా విరాట్తో వాగ్వాదం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే అతడు చాలాసార్లు స్పందించాడు. తాజాగా దక్షిణాఫ్రికా-భారత్ (SA vs IND) వన్డే సిరీస్ అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో గంభీర్ ముందు ఇదే ప్రశ్న పునరావృతమైంది. దీనికి అతడు కాస్త అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇటీవల విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎవరి బౌలింగ్లో ఈ మార్క్ను అందుకున్నాడని క్రీడా కార్యక్రమంలో గంభీర్ను వ్యాఖ్యాత అడిగాడు. ‘‘లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో కోహ్లీ సెంచరీ మార్క్ను తాకాడు. వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్పై’’ అని గంభీర్ సమాధానం ఇచ్చాడు. వెంటనే సదరు వ్యాఖ్యాత మరోసారి ఐపీఎల్ నాటి సంఘటనను ప్రస్తావించాడు. దీంతో గంభీర్ స్పందిస్తూ.. ‘‘మీరు పదే పదే ఆ క్లిప్పింగ్లను చూపించినా.. నా సమాధానం ఒక్కటే. కోహ్లీ అయినా.. వేరేవారైనా వాగ్వాదం అనేది కేవలం మైదానంలోనే’’ అని స్పష్టం చేశాడు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సంజూలో పట్టుదల కనిపించింది..
దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ఆటగాడు. ఐపీఎల్లో అతడి ఆటతీరు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు పునరుజ్జీవం వచ్చినట్లు అయింది. దీనికి ముందు చాలా అవకాశాలు వచ్చినా ఒడిసిపట్టుకోలేకపోయాడు. కానీ, ఇప్పుడు ఈ శతకంతో సెలక్టర్లను ఆకట్టుకోవడమే కాకుండా.. వారిపై ఒత్తిడి కూడా తెచ్చినట్లే. అయితే, ఇలాంటి నిలకడను మున్ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే సంజూకు వన్డే ఫార్మాట్లో అవకాశాలు ఇవ్వాలి’’ అని గంభీర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్