IND vs AUS: అహ్మదాబాద్లో స్పిన్నెంత?
నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్ను సిద్ధం చేస్తున్నారు? తొలి మూడు టెస్టుల్లో లాగే బంతి విపరీతంగా తిరగబోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.
నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్ను సిద్ధం చేస్తున్నారు? తొలి మూడు టెస్టుల్లో లాగే బంతి విపరీతంగా తిరగబోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అందరి దృష్టీ అహ్మదాబాద్పైనే. పిచ్కు సంబంధించి బయటికొచ్చిన చిత్రాలు దాని స్వభావంపై అస్పష్టతను మరింత పెంచేలా ఉన్నాయి.
అహ్మదాబాద్
సొంతగడ్డపై ఆడుతుందంటే స్పిన్నే టీమ్ఇండియా ఆయుధం. ఇప్పుడు బోర్డర్-గావస్కర్ సిరీస్లోనూ అదే అస్త్రాన్ని సంధించింది. గిరా గిరా తిరిగే పిచ్లతో తొలి రెండు టెస్టులను ఖాతాలో వేసుకుంది. కానీ తర్వాతే వ్యూహం బెడిసి కొట్టింది. మరింత విపరీతంగా సహకరించిన ఇందౌర్ పిచ్పై బోల్తా కొట్టడం రోహిత్సేన వంతయింది. నాణ్యత విషయంలో తొలి రెండు టెస్టుల పిచ్లకు పాసు మార్కులతో సరిపెట్టిన ఐసీసీ.. మూడో టెస్టు పిచ్పై పెదవి విరిచింది. పేలవ రేటింగ్ ఇచ్చింది. ‘‘పిచ్ మరీ పొడిగా ఉంది. బ్యాట్కు, బంతికి సమతూకం లేదు. పిచ్ ఆరంభం నుంచే స్పిన్నర్లకు సహకరించింది. మ్యాచ్ ఆసాంతం బౌన్స్ అతిగా, అస్థిరంగా ఉంది’’ అని రిఫరీ క్రిస్ బ్రాడ్ తన నివేదికలో పేర్కొన్నాడు. తొలి రోజు నుంచే స్పిన్కు విపరీతంగా సహరించడమేంటని మాజీ ఆటగాళ్లూ విమర్శించారు. శ్రీకాంతైతే ఆ పిచ్పై తానూ వికెట్లు తీసే వాడినని అన్నాడు. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్ ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే టీమ్ ఇండియాకు విజయం తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిన సంగతి తెలిసిందే.
పిచ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదా?: నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ ఎలాంటి ఉండాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయం తీసుకోనట్లే కనిపిస్తోంది. పిచ్కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటికొచ్చాయి. కానీ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఆస్ట్రేలియా బృందం ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. మ్యాచ్ ఆరంభమయ్యేది గురువారమే. ఎంతో సమయం లేదు. అయినా పిచ్ తయారీకి సంబంధించి బీసీసీఐ నుంచి గానీ, భారత జట్టు మేనేజ్మెంట్ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని క్యురేటర్లు చెప్పారు. దీన్ని బట్టి ఎలాంటి పిచ్ కావాలన్న విషయంలో భారత శిబిరం కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం వరకు నాలుగో టెస్టు వేదికలో రెండు పిచ్లను కప్పి ఉంచారు. మ్యాచ్కు దేన్ని ఉపయోగిస్తారో తెలియదు. దీంతో పిచ్ స్వభావంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ‘‘భారత జట్టు మేనేజ్మెంట్ నుంచి మాకు ఏ సూచనలూ అందలేదు. స్థానిక క్యురేటర్లు మామూలు పిచ్ను సిద్ధం చేస్తున్నారు. సీజన్ ఆసాంతం ఉన్నట్లే పిచ్ ఇప్పుడూ ఉంటుంది’’ అని గుజరాత్ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి ఇంతకుముందు చెప్పాడు. మంచి టెస్టు మ్యాచ్ పిచ్ను సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమన్నాడు. ఏదేమైనా మ్యాచ్ ఫలితంలో పిచ్ మరోసారి కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ సిడ్నీలోనే ఉన్న నేపథ్యంలో.. ఆఖరి టెస్టులోనూ ఆస్ట్రేలియాకు స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. గత టెస్టులో గెలిచిన జట్టులో ఆసీస్ మార్పులు చేసే అవకాశం లేదు. మరోవైపు భారత జట్టులోకి మహ్మద్ షమి రావడం ఖాయం. గత మ్యాచ్కు అతడికి విశ్రాంతినిచ్చిన జట్టు.. ఉమేశ్ యాదవ్ను ఆడించింది. ఈసారి సిరాజ్కు విశ్రాంతినిచ్చి షమికి జోడీగా ఉమేశ్ను కొనసాగించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?