RR vs GT: ఛాంపియన్ ఆట
5 ఓవర్లకు 47/1.. అనంతరం 71 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.. ఇన్నింగ్స్లో రెండంకెల స్కోరు చేసింది నలుగురే.. అందులో 15 కంటే ఎక్కువ పరుగులు చేసింది ఒక్కరే
రాజస్థాన్పై గుజరాత్ ఘన విజయం
తిప్పేసిన రషీద్, అహ్మద్
సత్తాచాటిన సాహా, గిల్, హార్దిక్
జైపుర్
5 ఓవర్లకు 47/1.. అనంతరం 71 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.. ఇన్నింగ్స్లో రెండంకెల స్కోరు చేసింది నలుగురే.. అందులో 15 కంటే ఎక్కువ పరుగులు చేసింది ఒక్కరే.. గుజరాత్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్లో రాజస్థాన్ వైఫల్యానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఓ వైపు నుంచి పేస్.. మరోవైపు నుంచి స్పిన్తో ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఫీల్డింగ్లోనూ టైటాన్స్ అదరగొట్టడంతో రాయల్స్ నిలవలేకపోయింది. ఆడుతూ పాడుతూ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్.. ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది.
ఐపీఎల్- 16లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. దిల్లీతో గత మ్యాచ్లో 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆ జట్టు.. శుక్రవారం ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుచేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14), నూర్ అహ్మద్ (2/25) ధాటికి మొదట రాజస్థాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. 30 పరుగులు చేసిన శాంసనే టాప్స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఛేదనలో ఓ వికెట్ కోల్పోయిన టైటాన్స్ 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సాహా (41 నాటౌట్; 34 బంతుల్లో 5×4), శుభ్మన్ గిల్ (36; 35 బంతుల్లో 6×4), హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 3×6) సత్తాచాటారు. 10 మ్యాచ్ల్లో టైటాన్స్కిది ఏడో విజయం కాగా.. రాజస్థాన్కు అయిదో ఓటమి.
ధనాధన్..: అప్పటివరకూ రాజస్థాన్ బ్యాటర్లు తడబడ్డ పిచ్పై గుజరాత్ ఓపెనర్లు చెలరేగారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ శుభ్మన్ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోగా.. సాహా మాత్రం తొలి ఓవర్ నుంచే బౌండరీల వేటలో సాగాడు. నెమ్మదిగా శుభ్మన్ కూడా జోరందుకోవడంతో పవర్ప్లేలో 49/0తో నిలిచిన టైటాన్స్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. స్పిన్నర్లు రంగంలోకి దిగినా శుభ్మన్, సాహా ఏ మాత్రం తగ్గలేదు. లక్ష్యం చిన్నదే కావడంతో ఎలాంటి తొందరపాటు, తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించారు. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించారు. జంపా బౌలింగ్లో డ్రైవ్తో శుభ్మన్ కొట్టిన ఫోర్ ఆకట్టుకుంది. కానీ వెంటనే చాహల్ (1/22) లెగ్ కట్టర్ను అంచనా వేయలేక శుభ్మన్ స్టంపౌటయ్యాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ ఆ ఆనందం రాజస్థాన్కు మిగిల్చకుండా హార్దిక్ వస్తూనే తుపానులా ముంచెత్తాడు. అప్పటివరకూ ఓ మోస్తారుగా సాగిన ఇన్నింగ్స్కు రాకెట్ వేగాన్ని అందించాడు. స్టేడియంలోని అభిమానులను ధనాధన్ బ్యాటింగ్తో ఉర్రూతలూగించాడు. జంపా బౌలింగ్లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మూడు సిక్సర్లనూ బౌలర్ తల మీదుగా బౌండరీ దాటించి ఛేదనను మరింత వేగవంతం చేశాడు. సాహా, హార్దిక్ కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. ఈ జంట అబేధ్యమైన రెండో వికెట్కు 25 బంతుల్లోనే 48 పరుగులు జోడించింది.
టపటపా..: టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ మెరుగైన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోలేక బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. స్పిన్కు దాసోహమన్నారు. బ్యాటింగ్లో నిలకడ లేమి కొనసాగిస్తున్న బట్లర్ (8)ను తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 2వ)నే హార్దిక్ (1/22) పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ యశస్వి (14), కెప్టెన్ శాంసన్ నిలకడగా బౌండరీలు సాధించడంతో జట్టు 5 ఓవర్లకు 47/1తో మెరుగ్గానే నిలిచింది. కానీ ఆ తర్వాతే గుజరాత్ ఫీల్డింగ్, బౌలింగ్లో అదరగొట్టి కథను మలుపు తిప్పింది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. మంచి ఫామ్లో ఉన్న యశస్వి.. అభినవ్, మోహిత్ అద్భుత ఫీల్డింగ్తో రనౌటయ్యాడు. బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా శాంసన్ బంతి ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ వలయం లోపల ఉన్న అభినవ్ డైవ్ చేసి.. తన పక్కన ఉన్న మోహిత్ వైపు బంతి వెళ్లేలా చేశాడు. అప్పటికే పరుగు కోసం శాంసన్ దగ్గర వరకూ వచ్చిన యశస్వి.. తిరిగి నాన్స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అతను క్రీజులోకి చేరుకునే లోపు మోహిత్ త్రోను అందుకున్న రషీద్ స్టంప్స్ ఎగరగొట్టాడు. అక్కడి నుంచి బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. శాంసన్ను లిటిల్ (1/24), అశ్విన్ (2)ను రషీద్ పెవిలియన్ చేర్చారు. అప్పటికే ఔటైన యశస్వి స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన పరాగ్ (4) ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో రాజస్థాన్ 10 ఓవర్లకు 72/5తో కష్టాల్లో పడింది. రషీద్ బాటలో సాగుతూ మరో అఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ బౌలింగ్లో వైవిధ్యంతో వికెట్లు పడగొట్టాడు. మొదట దేవ్దత్ పడిక్కల్ (12)ను బౌల్డ్ చేసిన అతను.. తర్వాత ధ్రువ్ జూరెల్ (9)ను వెనక్కిపంపాడు. నాలుగో స్టంప్ మీద పడి కాస్త లోపలికి తిరిగిన బంతిని డిఫెండ్ చేద్దామని పడిక్కల్ ప్రయత్నించగా.. అది బ్యాట్కు సమీపం నుంచి వెళ్లి స్టంప్స్ను ముద్దాడింది. తన చివరి ఓవర్ కోసం మళ్లీ బంతి అందుకున్న రషీద్.. హెట్మయర్ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాజస్థాన్ చివరి ఆశ కూడా ఆవిరైంది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. తిరుగులేని యార్కర్తో బౌల్ట్ (15)ను షమి (1/27) బౌల్డ్ చేయగా.. ఎక్స్ట్రా కవర్లో బౌండరీ దగ్గర నుంచి అభినవ్ నేరుగా విసిరిన త్రోకు జంపా (7) రనౌటయ్యాడు.
బౌల్ట్ సిక్సర్.. కెమెరామన్కు గాయం
గుజరాత్తో మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు బౌల్ట్ కొట్టిన ఓ సిక్సర్ టీవీ కెమెరామన్ను గాయపరిచింది. నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని బౌల్ట్ మిడ్వికెట్ మీదుగా బౌండరీ బయటకు తరలించాడు. ఆ బంతి అక్కడే విధుల్లో ఉన్న టీవీ కెమెరామన్పై పడింది. అతను నొప్పితో బాధపడ్డాడు. అస్వస్థతకు గురై వైద్య చికిత్స తీసుకున్న కెమెరామన్ దగ్గరికి టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్పిన్నర్ రషీద్ ఖాన్ వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి రనౌట్ 14; బట్లర్ (సి) మోహిత్ (బి) హార్దిక్ 8; శాంసన్ (సి) హార్దిక్ (బి) లిటిల్ 30; దేవ్దత్ (బి) అహ్మద్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ ఎల్బీ (బి) రషీద్ 4; హెట్మయర్ ఎల్బీ (బి) రషీద్ 7; ధ్రువ్ జూరెల్ ఎల్బీ (బి) అహ్మద్ 9; బౌల్ట్ (బి) షమి 15; జంపా రనౌట్ 7; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం: (17.5 ఓవర్లలో ఆలౌట్) 118
వికెట్ల పతనం: 1-11, 2-47, 3-60, 4-63, 5-69, 6-77, 7-87, 8-96, 9-112
బౌలింగ్: షమి 4-0-27-1; హార్దిక్ 2-0-22-1; రషీద్ ఖాన్ 4-0-14-3; జోష్ లిటిల్ 4-0-24-1; నూర్ అహ్మద్ 3-0-25-2; మోహిత్ 0.5-0-5-0
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా నాటౌట్ 41; శుభ్మన్ (స్టంప్డ్) శాంసన్ (బి) చాహల్ 36; హార్దిక్ నాటౌట్ 39; ఎక్స్ట్రాలు 3; మొత్తం: (13.5 ఓవర్లలో ఒక వికెట్కు) 119
వికెట్ల పతనం: 1-71
బౌలింగ్: బౌల్ట్ 3-0-28-0; సందీప్ శర్మ 3-0-19-0; జంపా 3-0-40-0; చాహల్ 3.5-0-22-1; అశ్విన్ 1-0-8-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.