ఆసియా జూనియర్‌ హాకీ ఫైనల్లో భారత్‌

ఆసియా జూనియర్‌ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్‌లో భారత్‌ 9-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది.

Published : 01 Jun 2023 01:51 IST

సలాలా (ఒమన్‌): ఆసియా జూనియర్‌ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్‌లో భారత్‌ 9-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ధామి బాబీ సింగ్‌ మూడు గోల్స్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. అతను 31, 39, 55 నిమిషాల్లో గోల్స్‌ కొట్టాడు. లక్రా సునిత్‌ (13), హుండాల్‌ అరైజీత్‌ సింగ్‌ (19), అంగద్‌ (34), ఉత్తమ్‌ సింగ్‌ (38), విష్ణుకాంత్‌ (51), శార్దానంద్‌ (57) తలో గోల్‌ సాధించారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ 46వ నిమిషంలో నమోదైంది. పాకిస్థాన్‌, మలేసియా మధ్య రెండో సెమీస్‌ విజేతతో భారత్‌ టైటిల్‌ పోరులో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని