IND vs SL: స్పిన్ యుద్ధంలో గెలిచి ఫైనల్కు భారత్
హోరాహోరీ తప్పదనుకున్న పాకిస్థాన్ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చిన టీమ్ఇండియాకు.. తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు.
మరోసారి కుల్దీప్ మాయ
పోరాడిన వెల్లలాగె
లంకపై చెమటోడ్చి నెగ్గిన టీమ్ఇండియా
కొలంబో
హోరాహోరీ తప్పదనుకున్న పాకిస్థాన్ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చిన టీమ్ఇండియాకు.. తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. స్పిన్నర్ల స్వర్గధామంగా మారిన కొలంబో పిచ్ను గొప్పగా ఉపయోగించుకున్న లంకేయులు భారత బ్యాటర్లకు గట్టి సవాలే విసిరారు. ఇన్నింగ్స్ను ఘనంగా మొదలుపెట్టి 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన టీమ్ఇండియాను.. యువ స్పిన్నర్ వెల్లలాగె, పార్ట్టైమర్ అసలంక కొలంబో పిచ్పై డ్యాన్స్ చేయించి, 213 పరుగులకే పరిమితమయ్యేలా చేశారు. బౌలింగ్లోనూ భారత్కు అదిరే ఆరంభం దక్కినా.. లంక అంత తేలిగ్గా వదిలితేనా! గత మ్యాచ్ హీరో కుల్దీప్ యాదవ్ మరోసారి విజృంభించడంతో భారత్ గట్టెక్కేసింది. సూపర్-4లో వరుసగా రెండో విజయం సాధించిన భారత్ ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది.
ఆసియా కప్ వన్డే టోర్నీలో అజేయంగా సాగిపోతున్న టీమ్ఇండియా.. సూపర్-4లో మరో విజయం సాధించి ఫైనల్ బెర్తును పట్టేసింది. మంగళవారం రోహిత్సేన 41 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. మొదట దునిత్ వెల్లలాగె (5/40), అసలంక (4/18)ల ధాటికి భారత్ 213 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7×4, 2×6) జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పింది. అనంతరం కుల్దీప్ యాదవ్ (4/43) విజృంభణతో లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా (2/30), జడేజా (2/33) కూడా సత్తా చాటారు. వెల్లలాగె (42 నాటౌట్; 46 బంతుల్లో 3×4, 1×6) బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వా (41) రాణించాడు. భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్లో శుక్రవారం బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. అంతకంటే ముందు గురువారం కీలక పోరులో పాక్, లంక తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ను ఢీకొంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్రేట్ కలిగిన శ్రీలంక ఫైనల్ చేరుతుంది.
భయపెట్టిన ఆ ఇద్దరూ..: భారత్ ఇన్నింగ్స్లో స్పిన్నర్ల ఆధిపత్యం చూశాక.. ఆరంభం నుంచే రోహిత్ స్పిన్ దాడి మొదలుపెడతాడేమో అనిపించింది. కానీ అతను బుమ్రా, సిరాజ్లనే దించాడు. వాళ్లిద్దరూ లంక బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టారు. బుమ్రా.. స్వల్ప వ్యవధిలో నిశాంక (6), కుశాల్ మెండిస్ (15)లను పెవిలియన్ చేర్చాడు. కరుణరత్నె (2)ను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. పేసర్ల బౌలింగ్కే లంక బ్యాటర్లు నిలవలేకపోతున్నారంటే, స్పిన్నర్లు దిగితే ఇంకెలా ఉంటుందో అనుకుంటే.. అసలంక (22), సమరవిక్రమ (17).. కుల్దీప్, జడేజాలను బాగానే ఎదుర్కొన్నారు. ఈ జోడీ పది ఓవర్లకు పైగా వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. లంక 25/3 నుంచి 68/3కు చేరుకుంది. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్లో కంగారు మొదలైంది. అయితే ఈ దశలోనే కుల్దీప్ మాయాజాలం మొదలైంది. అతను వరుస ఓవర్లలో సమరవిక్రమ, అసలంకలను ఔట్ చేసి లంకను గట్టి దెబ్బ తీశాడు. శానక (9)ను జడేజా ఔట్ చేయడంతో లంక పనైపోయినట్లే కనిపించింది. కానీ 99/6తో పతనం దిశగా సాగుతున్న లంకలో ధనంజయ, వెల్లలాగే మళ్లీ ఆశలు రేపారు. ఈ జోడీ కొంతసేపు ఆచితూచి ఆడి, ఆ తర్వాత ఎదురుదాడి చేయడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. 4 వికెట్లు చేతిలో ఉండగా 13 ఓవర్లలో 57 పరుగులే చేయాల్సి రావడంతో భారత్కు కష్టమే అనిపించింది. కానీ ధనంజయను ఔట్ చేసి జడేజా మ్యాచ్ను మలుపు తిప్పాడు. వెల్లలాగె మాత్రం పోరాటాన్ని కొనసాగించాడు. అయితే మరో ఎండ్లో బ్యాటర్లను భారత్ నిలవనీయలేదు. తీక్షణ (2)ను హార్దిక్ పెవిలియన్ చేర్చగా.. రజిత (1), పతిరన (0)లను ఒకే ఓవర్లో అద్భుతమైన డెలివరీలతో బౌల్డ్ చేసిన కుల్దీప్ లంక కథ ముగించాడు.
అతనొచ్చాక కథ మారింది: 80/0.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లకు చేసిన స్కోరిది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తూ.. లంక బౌలింగ్ను ధాటిగా ఎదుర్కోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరో ఎండ్లో శుభ్మన్ (19) ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. పాక్తో మ్యాచ్లో మాదిరే ఇన్నింగ్స్ సాగడంతో భారత్ మరోసారి భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. కానీ యువ స్పిన్నర్ వెల్లలాగె బంతి అందుకోగానే కథ మారిపోయింది. పేసర్లను అలవోకగా ఎదుర్కొన్న భారత బ్యాటర్లు.. అతడి ధాటికి కంగారెత్తిపోయారు. తన తొలి బంతికే శుభ్మన్ను బౌల్డ్ చేయడంతో మొదలైన వెల్లలాగె మాయ.. కోటాలో చివరి బంతి వరకు కొనసాగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కోహ్లి (3).. వెల్లలాగె రెండో ఓవర్లో పేలవ షాట్ ఆడి శానకకు క్యాచ్ ఇవ్వగా, అర్ధశతకం పూర్తి చేసి జోరుమీదున్న రోహిత్ సైతం అతడి బౌలింగ్లోనే బౌల్డయి వెనుదిరిగాడు. 93/3తో ఒక్కసారిగా కష్టాల్లో పడిన భారత్ను.. ఇషాన్ (33)తో కలిసి రాహుల్ ఆదుకున్నాడు. ఇదే మైదానంలో ముందు రోజు పాక్పై అలవోకగా పరుగులు సాధించిన రాహుల్.. ఈ మ్యాచ్లో మాత్రం కష్టపడక తప్పలేదు. పిచ్ అంత కఠినంగా మారింది. రాను రాను బంతి మరింత తిరగడంతో స్పిన్నర్లను ఎదుర్కోవడం శక్తికి మించిన పనే అయింది. అయినా ఈ జోడీ కష్టపడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. 30వ ఓవర్లో 154/3తో భారత్ మెరుగైన స్థితికి చేరుకుంది. కానీ స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో వెల్లలాగె బౌలింగ్లో షాట్ ఆడబోయి అతడికే క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరగడంతో మ్యాచ్ మళ్లీ మలుపు తిరిగింది. కాసేపటికే అసలంక బౌలింగ్లో వెల్లలాగె పట్టిన చక్కటి క్యాచ్కు ఇషాన్ కూడా ఔటైపోయాడు. పిచ్ స్పిన్ స్వర్గధామంలా మారడంతో పార్ట్టైమర్ అయిన అసలంకను దించి లంక కెప్టెన్ శానక చక్కటి ఫలితం రాబట్టాడు. ఇషాన్నే కాక జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0)లను కూడా అసలంక పెవిలియన్ చేర్చాడు. అతను అంతకంటే ముందు హార్దిక్ (5)ను ఔట్ చేసిన వెల్లలాగె అయిదు వికెట్ల ఘనత పూర్తి చేశాడు.బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్పై రెండు వైపులా స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమైపోయింది. ఒక దశలో 186/9కు చేరుకున్న భారత్.. అక్షర్ పటేల్ పోరాటంతో 200 దాటింది.
150
వన్డేల్లో కుల్దీప్ వికెట్లు. అతడికిది 87వ మ్యాచ్.
వన్డేల్లో టీమ్ఇండియా పదికి పది వికెట్లూ స్పిన్నర్లకే కోల్పోవ్వడం ఇదే తొలిసారి.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) వెల్లలాగె 53; శుభ్మన్ (బి) వెల్లలాగె 19; కోహ్లి (సి) శానక (బి) వెల్లలాగె 3; ఇషాన్ (సి) వెల్లలాగె (బి) అసలంక 33; రాహుల్ (సి) అండ్ (బి) వెల్లలాగె 39; హార్దిక్ (సి) కుశాల్ (బి) వెల్లలాగె 5; జడేజా (సి) కుశాల్ (బి) అసలంక 4; అక్షర్ పటేల్ (సి) సమరవిక్రమ (బి) తీక్షణ 26; బుమ్రా (బి) అసలంక 5; కుల్దీప్ (సి) ధనంజయ (బి) అసలంక 0; సిరాజ్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 21
మొత్తం: (49.1 ఓవర్లలో ఆలౌట్) 213;
వికెట్ల పతనం: 1-80, 2-90, 3-91, 4-154, 5-170, 6-172, 7-178, 8-186, 9-186; బౌలింగ్: రజిత 4-0-30-0; తీక్షణ 9.1-0-41-1; శానక 3-0-24-0; పతిరన 4-0-31-0; వెల్లలాగె 10-1-40-5; ధనంజయ డిసిల్వా 10-0-28-0; అసలంక 9-1-18-4
శ్రీలంక ఇన్నింగ్స్: నిశాంక (సి) రాహుల్ (బి) బుమ్రా 6; కరుణరత్నె (సి) గిల్ (బి) సిరాజ్ 2; కుశాల్ మెండిస్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 15; సమరవిక్రమ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 17; అసలంక (సి) రాహుల్ (బి) కుల్దీప్ 22; ధనంజయ (సి) గిల్ (బి) జడేజా 41; శానక (సి) రోహిత్ (బి) జడేజా 9; వెల్లలాగె నాటౌట్ 42; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 2; రజిత (బి) కుల్దీప్ 1; పతిరన (బి) కుల్దీప్ 0; ఎక్స్ట్రాలు 15
మొత్తం: (41.3 ఓవర్లలో ఆలౌట్) 172;
వికెట్ల పతనం: 1-7, 2-25, 3-25, 4-68, 5-73, 6-99, 7-162, 8-171, 9-172; బౌలింగ్: బుమ్రా 7-1-30-2; సిరాజ్ 5-2-17-1; హార్దిక్ 5-0-14-1; కుల్దీప్ యాదవ్ 9.3-0-43-4; జడేజా 10-0-33-2; అక్షర్ పటేల్ 5-0-29-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్డం దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ట్రోల్ చేయడంపై భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదేవిధంగా లఖ్నవూతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్కు రూ.24 లక్షలు జరిమానా పడింది. -
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్డం దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?